Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

విశాలాంధ్ర-తాడిపత్రి: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మునిసిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారము గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల వలన విద్యార్థినీ విద్యార్థులకు చిన్న తనం నుండి పోటీ తత్త్వం అలవడుతుందని తెలిపారు. ఈ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి గ్రంథాలయ ముగింపు వారోత్సవాలలో బహుమతులు ప్రధానం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శివ ప్రసాద్ రాజు, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img