విశాలాంధ్ర – ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం గుట్ట కింద పల్లి లో గల ఆర్డిటి కేంద్రంలో మంగళవారంతో అండర్ టెన్ మిక్స్డ్ జెండర్ హాకీ టోర్నమెంట్ పోటీలు ముగిసాయి. ముఖ్య అతిథిగా ఆర్డిటి. సిఓ.. ఆర్డినేటర్ ఓబులేసు, గో ట్లురు ఫిజికల్ డైరెక్టర్ రఘునాథ్,కుంటిమద్ది పిడి. నగేష్, ఆర్డిటి హాకీ కోచ్. అనిల్ రాజ్ పాల్గొన్నారు. ఈ పోటీలు ఉత్తేజపరంగా, రసవంతంగా జరిగాయి. గుడ్లూరు కుంటిమద్ది ధర్మవరం మూడు జట్లతో కలిసి రౌండ్ రాబిన్ లో పోటీల్లో జరిగాయి. ఈ చెట్లని కాకుండా గొట్లురు రన్రపుగా నిలవగా, ధర్మవరం రోడ్డు సెంటర్ విజేతలుగా నిలిచారు.