యోగాతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.. యోగా నిర్వాహకులు, ముఖ్య అతిథులు వెల్లడి
విశాలాంధ్ర – ధర్మవరం:: యోగాతోనే అందరికీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, యోగా నిర్వాహకులు, ముఖ్య అతిథులు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల జాతీయ యోగ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖులు కేశవ్ గురూజీ మార్గదర్శనం చేశారు. అనంతరం కేశవ్ గురూజీ మాట్లాడుతూ యోగా అనేది సకల రోగాలను పరిష్కరిస్తుందని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన సమయములలో యోగా ఆసనాలను నిర్వహించుకోవాలని తెలిపారు. అనంతరం 65 మంది యోగ ఆసనాలను సామూహికంగా నిర్వహించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యోగా వేడుకలు:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం వివేకానంద యోగా కేంద్ర ఆధ్వర్యంలో ఆర్గనైజర్ నరసింహులు, ముఖ్య అతిథి సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది శారీరక వ్యాయామే కాదు అని మనసులు శారీరక ఆరోగ్యాన్ని ఉన్నత ఆలోచనలు కలిగించి మన జీవిత విధానాన్ని మారుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య శెట్టి, గజేంద్ర, నాగరాజు, నాగభూషణ్ రెడ్డి, రవి మోహన్ రెడ్డి, దాసు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ పార్కులో యోగా వేడుకలు:: పట్టణంలోని పీఆర్టీ వీధిలో గల ఆదర్శ సేవా సంఘము ఆదర్శ గ్రీన్ పార్క్ జెండా ప్రాంగణమునందు యోగా వేడుకలు ప్రత్యేక వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ గ్రీన్ పార్క్ గౌరవ అధ్యక్షులు చెన్న ప్రకాష్, సభ్యులు పబ్బతి శ్రీనివాసులు, పవన్ కుమారులు పాల్గొని యోగా యొక్క లాభాలను తెలియజేశారు. అనంతరం అందరూ సామూహికంగా యోగ ఆసనాలను చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గంగాధర్ సహకారముతో రాగి జావాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి తో పాటు సేవా సంఘం గ్రీన్ పార్క్ సభ్యులు పాల్గొన్నారు.