విశాలాంధ్ర-రాప్తాడు : గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో గురువారం జరిగిన రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ అండర్ -19 ఖో ఖో పోటీల్లో పాల్గొనడానికి రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ పద్మజాదేవి, పీఈటీ మల్లికార్జున తెలిపారు. ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న కే.మహేష్ బాబు, ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న జే. మహేష్ రాష్టస్థ్రాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.