Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వైయస్సార్సీపి నుంచి జనసేన పార్టీలోకి చేరిక

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్కం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 37వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, వారితోపాటు పట్టణ ప్రముఖులు డాక్టర్ వెంగల్రెడ్డి, రిటైర్డ్ మిలటరీ రమణారెడ్డి, చంద్ర, ఓబుల్ రెడ్డి, రామచంద్ర నాయుడు, నారాయణస్వామి, ఓబులేసు, సురేష్, వెంకటేష్, శ్రీరాములు, కుమార్ తదితరులు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. వీరందరికీ చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ కండువాగప్పి ఘనంగా ఆహ్వానించారు. తదుపరి చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ను అత్యధిక ఓట్లతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వారు తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చడం వల్లనే జనసేన పార్టీలో చేరినట్లు పార్టీ అభ్యర్థులు తెలిపారు. చిలక మధుసూదన్ రెడ్డి దగ్గర తాము పని చేస్తే సమాజంలో కూడా ఎంతో గౌరవం ఉంటుందని వారు తెలిపారు. చిలక మధుసూదన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img