Friday, April 26, 2024
Friday, April 26, 2024

లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా జడ్జ్ జి. శ్రీనివాస్

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ ప్రారంభించారు
ఈకార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు జె.రాంమోహనరావు, ఇ.నాగేంద్రుడు, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు
లోక్ అదాలత్ లో ఉభయులూ రాజీపడి తగిన క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ తగాదాలు, మోటార్ యాక్సిడెంట్ పరిహార కేసులు, వర్క్ మెన్ కంపెన్షన్ కేసులు, కుటుంబ తగాదాలు, లేబర్ కోర్టు కేసులు, చిట్ ఫండ్ కంపెనీ కేసులు, చెక్ బౌన్స్ కేసులో పరిష్కారమయ్యే దిశగా ఈ కార్యక్రమంలో చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img