Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దివ్యాంగుల ఆశ్రమానికి భోజన ప్లేట్లు వితరణ

విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని ఆవులతిప్పయపల్లి గ్రామం వద్ద ఉన్న మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి భోజనం ప్లేట్లు, గ్లాసులు శనివారము వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమంలో మానసిక దివ్యాంగులకు భోజనం చేయడానికి ప్లేట్లు లేక ఇబ్బందిగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు తమ దృష్టికి తెచ్చారు. దీంతో తమ వంతు ఉడతా భక్తిగా భోజనం ప్లేట్లు, గ్లాసులు సహాయం అందించానన్నారు. అంతేకాకుండా మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నవారికి సేవ చేయడం ఎంతో కష్టం కాదు. కానీ మానసిక దివ్యాంగులకు సేవ చేయడం చాలా కష్టమని అలాంటి వారిని ఆశ్రమంలో ఉంచుకొని సేవ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆశ్రమ నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img