విశాలాంధ్ర-రాప్తాడు : మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని డాక్టర్ శివకృష్ణ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంుసందర్భంగా బుధవారం రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రాప్తాడులో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పొగాకును వ్యతిరేకించాలని సిగరెట్, బీడీ, గుట్కా లాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు గురవుతారని, ఆరోగ్యంగా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండాలన్నారు. ధూమపానం చేయడంవల్ల వారితో పాటు ఇతరులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. చిన్న వయస్సు గలవారు ధూమపానం చేయడం వల్ల వారి ఆరోగ్యం చెడిపోతుందని, తద్వారా క్యాన్సర్, క్షయ వంటి రోగాలు వస్తాయన్నారు. ఆయన వివరించారు. వైద్య సిబ్బంది పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ ధూమపానం చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీనరసమ్మ, ఏఎన్ఎం లీలావతి, ఆశా కార్యకర్తలు గాయత్రి, చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్లు డేవిడ్, కంబగిరి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.