విశాలాంధ్ర -అనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్, బ్రహ్మకుమారిస్, వివేకానంద యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ నుండి సప్తగిరి సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని గురువారం అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు .ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుంచి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్కు చేరిఅక్కడి నుండి శ్రీకంఠం సర్కిల్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కాలేజి ప్రాంగణానికి చేరింది. సుమారు 500 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ప్రాచీన భారతదేశ సంప్రదాయం నుంచి వచ్చిన ఒక గొప్ప వరం యోగ. మనసు శరీరమును సమన్వయపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మంచి భావాలను కలిగించేది యోగ. మానసిక సమస్యలను నివారించడంలో యోగా తోడ్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి,అనంతపురం ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ డిఎస్పి ముని రాజా , ఎస్కే యూనివర్సిటీ వారి రిజిస్టర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు. డాక్టర్ రామకుమార్ డాక్టర్ రఫీక్, డాక్టర్ తిరుపతి నాయుడు, ఆయుష్ సిబ్బంది, బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయ సిస్టర్ సరళ, వివేకానంద యోగా కేంద్రం సభ్యులు, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, యోగ మాస్టర్ వై. ఆంజనేయులు, ఈ ఎన్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.