విశాలాంధ్ర -పెనుకొండ : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలం, పరిధిలోని వెంకటగిరిపాళ్యం పంచాయతీ పరిధిలో గల మక్కాజ్ పల్లి తాండలో శాసనసభ్యులు శంకర్ నారాయణ మరియు నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అబివృద్ధి మరియు వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను వివరిస్తూ సంక్షేమ సారధిని ఆశీర్వదించాలని మరలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చేసుకోవడానికి అందరూ దీవించాలని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలని తెలిపారు,అలాగే ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందని వారికి ఎందుకు రాలేదని వివరిస్తూ, ప్రజల వ్యక్తిగత సమస్యలను సైతం తెలుసుకొని వాటిని అక్కడే అధికారుల సమక్షంలో పరిష్కారం చూపుతూ కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, బాబు,ఎంపీపీ, గీతా రామ్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ, శ్రీరాములు స్థానిక సర్పంచ్, ఆదినారాయణ ఎంపీటీసీలు నిర్మల నారాయణస్వామి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, పొగాకు రామచంద్ర, ఆగ్రి చైర్మన్ కొండలరాయుడు, సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, సచివాలయ కన్వీనర్, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.