Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మినీ మేనిపేస్టో చూసి వైసిపి ప్రభుత్వకి వణుకు పుట్టింది

విశాలాంధ్ర -పెనుకొండ : పట్టణం ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్నికల మినీ మేనిఫెస్టో పోస్టర్లను శనివారం విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అనంతరం ఆమె మాట్లాడుతూ
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిపేస్టో చూసి తాడేపల్లి ప్యాలెస్ గోడల బద్దలు అవుతున్నాయని వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పేదవారికి ధనికులుగా మార్చాలని ఉద్దేశంతో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. మహిళలు రైతులు యువత నిరుద్యోగులు జీవితాల్లో వెలుగులు నింపాలన లక్ష్యంతో ఈ మేనిఫెస్టో తయారు చేశారు. అన్నారు దేశంలో మహిళల అభివృద్ధిపై మొదటిగా ఆలోచన చేసి వ్యక్తి ఒకేఒక్కరు చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఆ ఆలోచనలో భాగంగా ద్వాక్రా మహిళా సంఘాలను తీసుకొచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మొదటి ఘనత చంద్రబాబునాయుడు కు దక్కింది అన్నారు. ఈ ఆలోచన విధానాన్ని దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో నమోదు చేశారన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ను లూటీ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది అన్నారు. మంచి పరిపాలన దిశగా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు సారధ్యంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. మినీ మేనిఫెస్టో ను చూపిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లలని టిడిపి పార్టీ అధికారంలోకి తీసుకొస్తూ గ్రామ గ్రామాన టిడిపి విజయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img