విశాలాంధ్ర- తనకల్లు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో జనసేన మండల కన్వీనర్కెవి రమణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. అనంతరం నల్లగుట్లపల్లి లో మారెమ్మ తల్లికి పొట్టేలుని బలి ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన మండల కన్వీనర్ కె.వి.రమణ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మహాకూటమి తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ కూటమి విజయదుంబి మోగించి అధికారం చేపట్టింది. ఈరోజు డిప్యూటీ సీఎం కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ వివిధ మంత్రి శాఖలకు ప్రమాణం చేస్తున్న సందర్భంగా జనసేన టిడిపి బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు.ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంసంక్షేమం తో పాటు అభివృద్ధి చెందాలని ఒకే రాజధాని అమరావతి ఉండాలని,మహాకూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా నిర్వహించాలని ఆ మారెమ్మ తల్లినిను కోరుకున్నామన్నారు ఐదు సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రము నుంచి తరిమి కొట్టడానికి సిద్ధపడి ఓటు ద్వారా వారికి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగినదని ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంల జిల్లా టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ జనసేన జిల్లా నాయకుడు కొట్టి అశ్వత్ కుమార్ శంకర్ నాథ్ ఎంపీటీసీ అమర్ జనసేన మండల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు జనసేన సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్ కొట్టి పెద్ద రవి టిడిపి కొట్టి రమేష్ వేణుగోపాల్ నాయుడు ఎంఎస్ శ్రీనివాసులు జనసేన యువనాయకులు శ్రావణ్ కుమార్ కొట్టి కిషోర్ కుమార్ కిరణ్ కుమార్ ఫయాజ్ మబ్బాషా సులేమాన్ ఖాసీంవేణుగోపాల్ లక్ష్మన్న వినయ్ కుమార్ శంకర్ నారాయణ సునీల్ వెంకటేష్ వెంకట్ నారాయణ శ్రీనాథ్ బాలాజీ నాగరాజు శ్రీనివాసులు వేమ నారాయణ మనీ గంగులప్పా మహేష్ కొల్లాయప్ప రమణ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.