విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ: పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఇండి విలేజ్ టెక్ సొల్యూషన్ డేటా ప్రాసెసింగ్ అనలిస్ట్ ఉద్యోగానికి నిర్వహించిన ప్రాంగణ నియామకల్లో 23 మంది విద్యార్థులు ఎంపికైనట్లు,వార్షిక వేతనం రెండు లక్షలు ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ డా. బండి రమేష్ బాబు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి , కళాశాల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.