విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండలోని వ్యవసాయ గోదాము నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వేరుశెనగ విత్తనాలను పరిశీలన చేయడం జరిగింది. సందర్బంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను పంపిణి చేయడంలో ప్రభుత్వం వైపల్యం చెందింది అని, నాసిరకం విత్తనాలు వేయడంవలన పంటదిగుబడి తగ్గి రైతు నష్టపోతాడు అని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షలు హరి మాట్లాడుతూ రైతులనుంచి సేకరించిన విత్తనాలను శుద్ధి చేయకుండా యాదవిధిగా పంపిణి చేయడం వలన బస్టాలలో చెత్త చెదారం పెరుకు పోయిందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోని నాణ్యమైన విత్తనాలను సకాలంలో పంపిణిచేయాలనీ ఏ పి రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో రమేష్, సభ్యులు గంగాధర్, తిప్పన, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.