ఐటీడీఏ పీఓ విష్ణు చరణ్
విశాలాంధ్ర, సీతానగరం : విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకొని ఉన్నతలక్ష్యాలను ఛేదించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టుఅధికారి సి. విష్ణు చరణ్ అన్నారు. బుదవారం సాయత్రం జోగింపేట ప్రతిభా పాఠశాల (స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్) ను ప్రాజెక్టుఅధికారి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులప్రమాణాలను ఆయన పరిశీలించారు. విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉండాలని ఆయన ఉద్బోధించారు. చదువుపట్ల ఏకాగ్రత ఉండాలని సూచించారు. ఏఅంశాల్లో వెనుకబడి ఉన్నామో గ్రహించి వాటిపై కొంతశ్రద్ద పెట్టాలని, తద్వారాఅందులో సంశయాలు తొలగుతాయన్నారు. అప్పటికి సంశయాలు ఉంటే ఉపాధ్యాయులవద్ద నివృత్తి చేసుకోవాలని కోరారు.తరగతుల్లో అంశాలవారీగా వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులుగుర్తించి తగుతర్ఫీదు ఇవ్వాలన్నారు.తదుపరి కోర్సులు, ఇతర అవకాశాలుపట్ల విద్యార్థులకు మార్గదర్శకంచేయాలని ఆయన సూచించారు. విద్యార్ధుల విద్యా ప్రమాణాలుపట్ల దృష్టిసారిస్తూనే, మెనూ అమలులో పక్కాగాఉండాలని ఆదేశించారు. నాణ్యమైనఆహారం, రక్షిత మంచినీరు సరఫరాఉండాలని ఆయన స్పష్టంచేశారు. విద్యార్ధుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలన్నారు. విధ్యార్ధుల హాజరు, స్టాఫ్ హాజరు పరిశీలించారు. మినీ ఆడిటోరియంను, డైనింగ్ హాలును, పాటశాల పరిసరాలను పరిశీలించారు. ఈసందర్శనలో ప్రిన్సిపాల్ పోల వెంకట నాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు పరిశీలన చేసిన పిఓ:
మండలంలోని నిడగల్లు, పాపమ్మవలస గ్రామాలలో ధాన్యం నిల్వలు, కోనుగోలు కేంద్రాలను పి ఓ విష్ణు చరణ్ ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడారు.ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. గోనె సంచులు ఇస్తున్నామని, రవాణా చార్జీలు చెల్లిస్తామని చెప్పారు. ప్రతీ ధాన్యం గింజను కోనుగోలు చేస్తామని, మిల్లర్లు ప్రమేయం పూర్తిగా ఉండదని తెలిపారు. ఆయనతో మండల వ్యవసాయాధికారి ఎస్ అవినాష్, రైతులు పాల్గొన్నారు.