విశాలాంధ్ర :శెట్టూరు 55వ జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ ఎల్ ఎం ఉమా మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి 20 తారీకు వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నెహ్రూ చిత్రపటానికి పూలమాలేసి స్థానిక ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి, గ్రామ సర్పంచ్ కుమార్, ఘనంగా ప్రారంభించారు
ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రంథాలయంలో దినపత్రికలు ద్వారా విజ్ఞాన పత్రికలు వార మాస పత్రికలతో పాటు వివిధ రకాల నవలలు ఆధ్యాత్మికమైన పుస్తకాలు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు తదితరులు అందుబాటులో ఉంటున్నావ్ అన్నారు విద్యావంతులు చిన్న పిల్లలు విద్యార్థులు గ్రంధాలయాలలో అంతేకాకుండా ప్రతి ఏటా చిన్న పిల్లలకు వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రంథాలయ అధికారి రజిని,గోపి, అంగన్వాడి టీచర్ విశాలమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.