విశాలాంధ్ర – ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపుమేరకు, శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ డేను ఘనంగా రెవెన్యూ ఉద్యోగులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి హాజరై పలు రెవెన్యూ సేవలను వారు కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ 20/6/1786 వ సంవత్సరములో రెవెన్యూ డిపార్ట్మెంట్ అని నామకరణం చేసి గుర్తించబడిదని తెలిపారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఎంతో బాధ్యతాయుతంగా పని చేయడం అలవాటు చేసుకోవాలని వారు తెలిపారు. 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రెవెన్యూ డే రోజున పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను తప్పనిసరిగా సన్మానించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. దేశానికి స్వాతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1953లో ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు. అనంతరం రిటైర్డ్ తాసిల్దార్ వెంకటేశులును ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్ డి ఓ కార్యాలయ, ధర్మారం తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తాసిల్దార్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.