Friday, October 25, 2024
Friday, October 25, 2024

సేవా కార్యక్రమములో ఎంతో సంతృప్తి ఉంది

శ్రీ సత్య సాయి భజన మండలి

విశాలాంధ్ర – ధర్మవరం:: సేవా కార్యక్రమంలో నిర్వహించడంలో ఎంతో సంతృప్తి సంతోషం ఉంటుందని శ్రీ సత్య సాయి భజన మండలి పాత భజన మందిర నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 200 మంది రోగులకు పాలు, బ్రెడ్డు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా పోడమల రాగని వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలే కీలకంగా ఉన్నారని, వారి సహాయ సహకారాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి భజన మండలి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. దాతల యొక్క సహకారం మరో రానిదని తెలిపారు. అనంతరం రోగులు ఆసుపత్రి సిబ్బంది తరపున వారు కృతజ్ఞతలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి పాత భజన మందిరం సత్యసాయి వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img