విశాలాంధ్ర-రాప్తాడు (కనగానపల్లి) : సమస్త మానవాళికి యోగా ప్రాణాధారమని, దీనిని ఆచరించి విశ్వంలోని సంపూర్ణ శక్తిని పొంది ఆరోగ్యవంతులు కావాలని హెచ్ఎం లక్ష్మీదేవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కనగానపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో యోగా చేయించారు. హెచ్ఎం మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి మానవుడు అనేక సమస్యలతో సతమతమవుతుంటారని, దీనిని నిరోధించడానికి యోగా ఒకటే సరైన మార్గమన్నారు. భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలలో అంతర్భాగమైన యోగ యొక్క విశిష్టతను నేడు ప్రపంచ దేశాలు ఆచరించే అద్భుత అవకాశాన్ని మన భారతదేశం అందించిందన్నారు. దీని ద్వారా భరత జాతి యొక్క ఔన్నత్యాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడమేనని ఆమె కొనియాడారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ గొప్పతనాన్ని తెలుసుకొని ఆచరించి,తమ జీవితాలలోఉత్తమ వెలుగులు నింపుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యోగా గురువు అంకె సుబ్బరాయుడు, ద్వారా సూర్య నమస్కారాలు, యోగాసనాలను చేయించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పి.డీ. బొగ్గు రమేష్, మోడల్ స్కూల్ పీడీ తలారి మాధవ, ఉపాధ్యాయులు అబ్బాస్, నాగన్న, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.