Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

త్రాగునీటి కోసం బిందెలతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన

విశాలాంధ్ర- పెనుకొండ : నగర పంచాయతీ ఒకటవ వార్డు ఇస్లాపురం గ్రామంలో గత నెల రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యపై ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో తమ యొక్క నిరసనను మహిళలు తెలియజేశారు గత నెల రోజుల నుంచి తాగునీటి రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని నగర పంచాయతీ సమావేశాలలో ఎన్నిసార్లు విన్నవించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అనే ఉద్దేశంతో ఆ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని తాగునీటికి అనేక ఇబ్బందులు గురవుతున్నామని మహిళలు వాపోయారు అనంతరం సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన తెదేపా నాయకులు,ఇస్లాపురం గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీరాములు కౌన్సిలర్ లు హనుమంతు, సప్తగిరి మరియు ఇస్లాపురం గ్రామ ప్రజలు, అనేక మంది మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img