Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం

విశాలాంధ్ర -ఉరవకొండ : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థి రామచంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం ఉరవకొండ మండలం వై. రాంపురం, రాకెట్ల, కౌకుంట్ల, ఆమిద్యాల,మోపిడి ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, ఉరవకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ సి. ఓబులేసు, వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ రఘు రాములు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై శాసనమండలిలో తన వానిని వినపించునున్న రామచంద్రారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని వారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఆంజనేయులు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img