Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పొంచి ఉన్న ప్రమాదం- స్పందించని విద్యుత్‌ శాఖ అధికారులు

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లాలో తరచు విద్యుత్తు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం తమ మొద్దు నిద్ర వీడడం లేదు ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం దళిత వాడలో మిద్దెలపైనే విద్యుత్‌ వైర్లు చేతికందే ఎత్తులు ఉన్నాయి వాటిని తొలగించాలని లేదా ఎత్తు పెంచాలని సంబంధిత కాలనీవాసులు అనేక మార్లు విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదని ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు ఎప్పుడు విద్యుత్‌ తీగలు తెగి కిందికి పడతాయో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా జీవిస్తున్నట్లు ఆ కాలనీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img