: తులసిరెడ్డి
గ్రామ- వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే ప్రొబేషన్ డిక్లరేషన్ మూడు నెలల పాటు ఆలస్యం అయ్యిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆ ఉద్యోగుల ప్రొబేషన్ను వెంటనే డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 02-10-2021 నాటికి రెండేళ్ల ప్రొబేషన్ కాలం పూర్తి అయ్యిందని అన్నారు. 30-06-2022 వరకూ ఆగమని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. సచివాలయ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంఫీుభావం తెలుపుతోందని పేర్కొన్నారు.