ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసుస్టేషన్లో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుమారు వారం రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. దీనిపై మంగళవారం ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు.