ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బలపరుస్తున్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మూకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. సోమవారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడిరచారు. గతంలో కూడా కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాంలను టీడీపీ బలపర్చిందని, అలాగే లోక్సభ స్పీకర్గా బాలయోగిని, శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతిలను టీడీపీ ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్రమంత్రిగా కింజారపు ఎర్రంనాయుడుని చేయడం ద్వారా టీడీపీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని, పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో టీడీపీ బలపరిచింది. ఈ విధంగా తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం మొదటి నుంచి టీడీపీ ముందు వరుసలో నిలబడిరదని చంద్రబాబు పేర్కొన్నారు.