ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఉండవని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ విషయంలో టీడీపీ కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాల భ్రష్టు పట్టించారని, సోలార్ పవర్ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్షం అడ్డుకుందని అన్నారు. ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు.