డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టైన ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు విధించిన రిమాండ్ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న అనంతబాబు జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతబాబుకు ఈ నెల 26 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా న్యాయమూర్తి ప్రకటించడంతో పోలీసులు అనంతబాబును తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు.