Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య : చంద్రబాబు

ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అజాత శత్రువని.. కాంగ్రెస్‌కు రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. 15 సార్లు బడ్జెట్‌ పెట్టిన చరిత్ర రోశయ్యదన్నారు. రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళమని కానీ ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రోశయ్య ఒక వ్యక్తి కాదని.. ఒక వ్యవస్థ లాంటి వారన్నారు. రోశయ్య కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img