Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ నేత మాగుంట రాఘవ రెడ్డి కస్టడీని రౌస్‌ రెవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆయనకు మరో 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో మాగుంట రాఘవ రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది.ఢల్లీి లిక్కర్‌ స్కాంలో పలువురు ప్రముఖుల పాత్ర ఉన్నట్టు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేర్లు వినిపించాయి. ఈ కేసుకు సంబంధించి మూడు వారాల క్రితం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఢల్లీిలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్టు ఈడీ అప్పట్లో ప్రకటించింది. రాఘవరెడ్డిని సీబీఐ గతేడాది అక్టోబర్‌లోనే ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img