మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారని, ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆరోపించారు. రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయ మార్పుతోనే ఉద్యమానికి ఫలితం ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజధాని మార్చమని వైసీపీ నేతలు నమ్మించారని… ఏపీ రాజధాని ఎక్కడ అంటే అయోమయ పరిస్థితి ఏర్పడిరదన్నారు. రాజధాని రైతులు చేపట్టే పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు రాజకీయ పక్షాలు కృషి చేయాలని అన్నారు.