మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ సీఎం జగన్ తొలిసారిగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. అయితే, ఆ సమీక్షకు విద్యాశాఖ కొత్త మంత్రి అయిన బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టారు. ఆయనకు అది తొలి సమీక్షే అయినా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అయితే, తన సోదరుడి కుమార్తె వివాహ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నానని, అందుకే సమీక్షకు రాలేకపోతున్నానని ఆయన ముందేసమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.