Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధం.. సీఎం జ‌గ‌న్

52 లక్షల మంది రైతన్నలకు రూ. 3923.21 కోట్ల రైతు భరోసా సాయం

కర్నూలు జిల్లా పత్తికొండలో నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధమ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బటన్ నొక్కి రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూౌ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. ఆ రైతు పంట వేసే నాటి నుంచి కోత కోసే వరకు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదని అన్ని వసతులను రైతు భరోసా కేంద్రం రూపంలో సొంతూళ్లోనే ఏర్పాటు చేశామని అన్నారు. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శిస్తే.. నేడు అదే రైతన్నను రాజుగా నిలిపి వ్యవసాయాన్ని పండగలా మార్చామ‌న్నారు. విత్తనాలు మొదలు పంట కోతల అనంతరం ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయడం వరకు మీ బిడ్డ ప్రభుత్వం రైతన్నల వెంటే ఉంటుందన్నారు. రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మీ బిడ్డ లక్ష్యమ‌న్నారు. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నానన్నారు. చంద్రబాబు మన పథకాలు.. పనులను కాపీ కొడుతున్నారని.. వైఎస్సార్ సీపీ పథకాలన్నీ కలిపి టీడీపీ మేనిపెస్టో పేరుతో చంద్రబాబు పులిహోరా కలిపారని.. బిస్మిల్లాబాత్ చేశారని సీఎం జగన్ చంద్రబాబుపై విురుచుకుపడ్డారు. సీఎంగా పనిచేసినంత కాలం ప్రజలకు ఏం మంచి చేయలేక.. ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు క్యారెక్టర్, ఒరిజినాలిటీ రెండూ లేవని సీఎం అన్నారు. 1995లోనే సీఎం అయిన చంద్రబాబు నేటికీ ఒక్క ఛాన్స్ అని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ మేనిపెస్టో సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు కష్టాలను తడిమి చూసి.. అదే ప్రజల గుండె చప్పుడుగా పుట్టిందని భావోధ్వేగానికి లోనయ్యారు. కానీ చంద్రబాబు మెంటాలిటీ అది కాదని గెలిచే వరకు ప్రజలను బ్రతిమాలడం గెలిచిన మేనిపెస్టోను చెత్తబుట్టలో పడేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడ‌వడమేనని పేర్కొన్నారు. రైతన్నకు సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటానన్నారు. రైతన్న ఎక్కడా ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని.. ప్రస్తుతం 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని. కానీ మీ బిడ్డ ప్రభుత్వం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటోందని ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం అందించామని వివరించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నామని, మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31వేల కోట్లు జమ చేశామని తెలిపారు.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించినట్లు సీఎం జగన్ వివరించారు. ఈ ధాన్యం సేకరణలో ఏ ఒక్క రైతన్నను ఇబ్బంది పెట్టుకుండా గ్రామాల్లోనే సేకరణ జరిగేలా చూశామని వివరించారు. ఈ నాలుగేళ్లలో ధాన్య సేకరణపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ ఖర్చు రూ. 77 వేల కోట్లకు చేరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో గ్రామ స్థాయిలోని భూ వివాదాలతో రైతన్నలు చితికిపోయే వారని, దీనికి పరిష్కారంగా సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టే భారీ కార్యక్రమం చేస్తున్నట్లు వివరించారు. రైతులకు పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తూనే.. రూ.1,700 కోట్లతో ఫీడర్లను బలోపేతం చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందని, గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ సేవలను తేవడంలో భాగంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను మీ గ్రామానికే తీసుకొచ్చేందకు మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రతి ఏటా కరువేరనని.. మన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. వలసలు లేవని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారని అన్నారు. చంద్రబాబు, కరువు కవలలుగా ఉన్నారని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని ఇదే మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పాలనకు తేడా అని ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి రైతన్నను సంపూర్ణంగా ఆదుకున్నామనిఅన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబుకు కనీసం రైతన్నల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా అప్పట్లో రాలేదని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img