ఏపీలోని సినీ అభిమానులకు ఏపీ ఫైబర్ నెట్ గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో సినిమా విడుదలైన రోజే టీవీలో ప్రదర్శించనున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ వెల్లడించారు. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్లోని సినీ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) సంస్థ శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీ ఫైబర్ నెట్ సదుపాయం కలిగిన వారు ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు చూసే వెసులుబాటు కల్పించనుంది. థియేటర్ తరహాలో ాఫస్ట్ డే.. ఫస్ట్ షో్ణ చూసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ఛైర్మన్ గౌతమ్రెడ్డి వెల్లడించారు. అయితే, ఇందుకోసం నెలకొకసారి కాకుండా రొజుకొకసారి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 2వ తేదీన విశాఖపట్నం వేదికగా కొత్త సినిమా ప్రసారాలను ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ మేరకు గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ నెట్ వినియోగదారులకు ఒక వినూత్నమైన కొత్తదనాన్ని తీసుకురావడానికి థియేటర్లో ఏ రోజైతే సినిమా ప్రదర్శన జరుగుతుందో అదే రోజున ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రేక్షకులు అందరూ వీక్షించేలా దీన్ని తీర్చిదిద్దామని చెప్పారు. నిర్మాతలతో మాట్లాడిన తర్వాత సినిమా ప్రదర్శితమవుతుందని వివరించారు. కొత్త సినిమాలను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారికి 24 గంటల పాటు సినిమా అందుబాటులో ఉంటుందని వివరించారు.అయితే, ఇది ఓటీటీ ఫ్లాట్ఫాం లాంటిది కాదని గౌతమ్ రెడ్డి చెప్పారు. జూన్ 2వ తేదీన విశాఖపట్నం వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే సినీ రంగ ప్రముఖులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతానికి చిన్న సినిమాలను ఇలా ప్రదర్శిస్తామని వివరించారు. పెద్ద సినిమాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గౌతమ్రెడ్డి వెల్లడించారు.