ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రాలలోకి పిన్నెల్లిని వెళ్లవద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆంక్షలు విధించింది. న్యాయమూర్తుల ముందు పిన్నెల్లి ఈవిఎంలను ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరుపున న్యాయవాదులు ప్రదర్శించారు. పిన్నెల్లి బెయిలు రద్దు చేయాలని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ పై విచారణ నిర్వహించారు.