Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎక్కువ మందికి టీకా ఇవ్వగలిగాం


: సీఎం జగన్‌
రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్నారు.గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. ‘‘పీడియాట్రిక్‌ సూపర్‌కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కొవిడ్‌కేర్‌ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి.’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img