టీడీపీ నేత వంగలపూడి అనిత
జగన్ పాలనలో ప్రజలకు పండగ రోజూ చీకట్లేనని టీడీపీ నేత వంగలపూడి అనిత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు సామాన్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని, ప్రజల్లో కొనుగోలు శక్తి నిర్వీర్యమైపోయిందన్నారు.రాష్ట్రంలో సీఎం కృత్రిమ ఆర్ధిక మాంధ్యం సృష్టిస్తున్నారని అన్నారు. ఆదాయం సృష్టించడం చేతకాక పప్పు బెల్లాలపై పన్నులు వేస్తున్నారన్నారు. గతంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. ధరల స్థిరీకరణ నిధి అంటూ నిత్యావసరాల ధరలు పెంచారని అన్నారు. తిండి తగ్గించుకోండి అనే ఉత్తర కొరియా పరిస్థితులు ఏపీలో తెచ్చారని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలన అంతమైనపుడే అసలైన దీపావళి అని అన్నారు.