పేర్ని నాని
తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఓ ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారని, మరికొన్ని పార్టీలు కూడా వచ్చాయని అన్నారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుంది? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదన్నారు. మరో వైపు నదీ జలాల వినియోగంలో సీఎం కేసీఆర్ మాటతప్పారని అన్నారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమన్నామని చెప్పారు. డిరడి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని అన్నారు.