Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి : టీడీపీ నేత బోండా ఉమ

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని అన్నారు. సీఎం నివాసానికి సమీపంలో ఘటన జరిగినా చర్యలు లేవన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో నిందితులు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పుకొచ్చారు. సీఎం, డీజీపీలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. చర్యలు తీసుకోకపోవడం వల్లే తరచూ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఆ తల్లి డిమాండ్‌ ప్రకారం నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img