1,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందన్న సీఎం
రాష్ట్రంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ. 2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ ఒప్పుకుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ నెలకొల్పిన కాస్టిక్ సోడా యూనిట్ ను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిశ్రమ వల్ల 1,300 మందికి ప్రత్యక్షంగా 1,150 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై గతంలో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారని… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.