Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

వాడివేడిగా ఏపీ అసెంబ్లీ


గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీసీ సభ్యులు నినాదాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం మొదలైంది. కాగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీసీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.గవర్నర్‌ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేయబోయారు. అయితే గవర్నర్‌ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ ప్రజాప్రతినిధులు వెళ్లనీయకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img