ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,739 శాంపిల్స్ పరీక్షించగా,1,520 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2018200కి చేరింది. మహమ్మారి బారినపడి కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13887 కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో1,290మంది కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19891391కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14922 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,68,09,774 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.