మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందుతాయని 1937 నవంబర్ 16వ తేదీన జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఇవే అంశాలను పొందపరిచారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. శ్రీ బాగ్ ఒప్పందం దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉరవకొండ మండలం బుదగవి గ్రామంలో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ బాగ్ ఒప్పందంలో ఉన్న అనేక అంశాలను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని దీనికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలన్నారు వెనుకబడిన ప్రాంతాలు అయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర వికేంద్రీకరణ తోనే అభివృద్ధి చెందతాయన్నారు ఒకే చోట పరిపాలన కొనసాగడం వల్ల గతంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని కర్నూలు హైదరాబాద్ రాజధానులను కోల్పోవడం జరిగిందన్నారు నది జలాలతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందన్నారు అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా కేంద్రాల సంఖ్యను పెంచడం జరిగిందని సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారన్నారు అలాగే కర్నూలులో న్యాయ రాజధాని, విజయవాడ, విశాఖ కేంద్రాల్లో శాసన, పరిపాలన రాజధానులను ఏర్పాటుకు కృషి చేస్తున్నారని నిధులన్నీ ఒకే ప్రాంతంలో అభివృద్ధికి కేటాయించడం వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయన్నారు ముఖ్యమంత్రి చేపట్టిన వికేంద్రీకరణకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు