రాష్ట్రంలోని పలువురు సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు.పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల జేసీలు, ఎగ్జిబిటర్లతో భేటీ అయ్యారు. ఆన్లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలపై చర్చ చేపట్టారు. అలాగే అన్ని సినిమాలకు టిక్కెట్ ఒకే రేటు ఉండేలా కొత్త విధానం పైన చర్చ జరుపుతున్నట్లు సమాచారం.