ముంబయి: ప్రజలను నిరంతరం కనెక్ట్ చేసే అంతర్జాతీయ సంస్థగా పేరు తెచ్చుకుంది మెటా. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయినటువంటి మెటా ఎప్పటికప్పుడు నిజమైన సమాచారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఎలాంటి అవాస్తవాలకు అసలు చోటు ఇవ్వకూడదనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తూనే ఉంది. అందులో భాగంగా ఫ్యాక్ట్ చెకింగ్ కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చెకింగ్ కార్యక్రమాలను భారతదేశంలో మరింత విస్తరించనుంది. ఇందుకోసం, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల కోసం న్యూస్ మీటర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మెటా. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రజలను ఖచ్చితమైన మరియు ధృవీకరించబడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని భావిస్తోంది. దీనివల్ల తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళంతో ఇతర ప్రాంతీయ భారతీయ భాషల్లో వాస్తవాలను, నిజాలను మరింత మెరుగ్గా అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.