హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) హైదరాబాద్, వేరియన్ అత్యంత అధునాతన ఉపరితల మార్గదర్శక వ్యవస్థ ఐడెంటిఫై సాంకేతికతతో అనుసంధానించబడిన ఏఐ-ఆధారిత సంపూర్ణ పరిష్కారం ఎథోస్ రేడియోథెరపీని ప్రారంభించినట్లు వెల్లడిరచింది. క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇది నిలువనుంది. ఈ విప్లవాత్మక సాంకేతికత వ్యవస్థను గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి టి.హరీష్రావు ఘనంగా ప్రారంభించారు. ఏఐ-ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకురావటంతో, ఏఓఐ క్యాన్సర్ సంరక్షణలో నూతన ప్రమాణాలను నిర్దేశించింది. తెలంగాణ, వెలుపల ఉన్న రోగులకు అత్యాధునిక సాంకేతికత, వ్యక్తిగతీకరించిన చికిత్స అవకాశాలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.