బెంగళూరు: ఇంట్రాసిటీ లాజిస్టిక్స్లో మన దేశానికి ఎంతో పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్లో తనదైన శైలిలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది పోర్టర్. ‘డెలివరీ ఉందా? అయిపోతుంది’ అనే కాన్సెప్ట్తో తన మొదటి బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది వస్తువుల రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తుంది. ఇప్పటికే పోర్టర్ 80 లక్షల మంది వినియోగదారులకు సులభమైన డెలివరీ సొల్యూషన్లను అందించింది. అదే సమయంలో సురక్షితమైన ఎలాంటి ఇబ్బందులు లేని సేవను కూడా అందిస్తోంది. తాజాగా ‘డెలివరీ ఉందా? అయిపోతుంది’ క్యాంపెయిన్ ద్వారా అత్యుత్తమ సేవలను నమ్మకం, నాణ్యతతో అందిస్తుందన్న సమాచారంతో పాటు పోర్టర్ నిబద్ధతను కూడా తెలియచేస్తుంది. ఈ క్యాంపెయిన్తో పోర్టర్ ద్విచక్ర వాహనాలు, ఎల్సీవీలతో భారీ వాహనాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. అలాగే బ్రాండ్ను సమీకృత డెలివరీ సొల్యూషన్గా మార్చాలని భావిస్తోంది.