విజయవాడ: అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించినట్లు వెల్లడిరచింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్వర్క్ను పెంచడం లక్ష్యంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ చేస్తున్న విస్తరణలో ఇది ఒక భాగం. కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ భారతదేశం అంతటా లుపిన్కు ఉన్న 27 లేబరేటరీ, 410కి పైగా సేకరణ కేంద్రాలతో కూడిన లుపిన్ డయాగ్నోస్టిక్స్ విస్తృత నెట్వర్క్ను సంపూర్ణం చేస్తుంది. ఈ విస్తరణ సమగ్ర రోగనిర్ధారణ పరిష్కారాలను అందించడానికి, రోగనిర్ధారణ పరిశ్రమలో దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి లుపిన్ నిబద్ధతను నొక్కి చెబుతుంది. విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది.