ఐఎంజిసి, బ్యాంక్ ఆఫ్ ఇండియా
ముంబొయి : వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులు అందించేందుకు భారతదేశపు మొట్టమొదటి తనఖా గ్యారెంటీ కంపెనీ అయిన ఇండియా మార్ట్గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజిసి ), భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ఈరోజు వెల్లడిరచింది. ఈ భాగస్వామ్యం, సరసమైన గృహాల విభాగంలో జీతం మరియు స్వయం ఉపాధి పొందుతున్న గృహ రుణ కస్టమర్లపై దృష్టి సారిస్తుంది.