విశాలాంధ్ర/ఖమ్మం: రహదారి భద్రతను నిర్ధారించడమనేది హెచ్ఎంఎస్ఐ అత్యంత ప్రాధాన్యతాంశం. రోడ్లపై బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి, మరింత మనస్సాక్షిగా వ్యవహరించే, భద్రత-ఆధారిత సమాజాన్ని రూపొందించడంలో సహాయపడటానికి, కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచూ రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుంది. తాజాగా ఖమ్మం నగరంలో అలాంటి ప్రచారమే నిర్వహించి ప్రజల్లో చెరగని ముద్ర వేసింది హెచ్ఎంఎస్ఐ. ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, క్రియేటివ్ హై స్కూల్, శ్రీ విద్యానికేతన్ స్కూల్, ప్రాంగణంలో 2300 మందికిపైగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది పాఠశాల, కళాశాల స్థాయిలలో రహదారి భద్రతా విద్యా పాఠ్యాంశాలను చేర్చడాన్ని ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతా అవగాహన ప్రచారంలో రోడ్ సేఫ్టీ గేమ్స్, సేఫ్ రోడ్ థియరీ సెషన్, రోడ్ సైనేజ్, రైడిరగ్ భంగిమ శిక్షణ వంటి అత్యంత ఇంటరాక్టివ్ మరియు ఆకర్షణీయమైన కార్యకలాపాలు ఉంటాయి.