హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎలక్టాన్రిక్స్ తయారీదారు పీట్రాన్, భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ వేదిక ఉడాన్తో భాగస్వామ్యం చేసుకుని 2.5 లక్షల యూనిట్లను ఉడాన్పై విక్రయించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయల విలువ కలిగిన పీట్రాన్ ఉత్పత్తులను ఈ వేదిక ద్వారా విక్రయించారు. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యుఎస్), హెడ్ఫోన్ శ్రేణి ఉత్పత్తులు ఈ వ్యాపారంలో 72%కు పైగా తోడ్పాటునందించాయని పీట్రాన్ సీఈవో, ఫౌండర్ అమీన్ ఖ్వాజా అన్నారు.